English | Telugu

ఫిబ్రవరి 15 నుండి రెబెల్ చివరి స్కెడ్యూల్

ఫిబ్రవరి 15 నుండి రెబెల్ సెకండ్ స్కెడ్యూల్ ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా, పొడుగుకాళ్ళ సుందరి దీక్షా సేథ్ హీరోయిన్లుగా, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, జె.పుల్లారావు, జె.భగవాన్ నిర్మిస్తున్న చిత్రం " రెబెల్ ". ఈ "రెబెల్" చిత్రం ఇప్పటికి 70% వరకూ పూర్తయ్యింది. ఈ చిత్రం చివరి స్కెడ్యూల్ ఫిబ్రవరి 15 వ తేదీ నుండి ప్రారంభం కానుంది.

ఈ "రెబెల్ " చిత్రం రానున్న వేసవి శలవుల కానుకగా, "మే" నెల చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతూంది. తన అభిమాన హీరో బిరుదు యంగ్ రెబెల్ స్టార్ అవటం, అదే స్టైల్లో ఈ చిత్రం టైటిల్‍ "రెబెల్" కావటం వల్ల ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.