English | Telugu

రవితేజ కొత్త చిత్రం"దరువు"

రవితేజ కొత్త చిత్రం"దరువు". వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, తాప్సి హీరోయిన్ గా, "శౌర్యం" శివ దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రానికి "దరువు" అన్న పేరుని నిర్ణయించారు. ఈ చిత్రం పూర్తిగా మాస్ ఎంటర్ టైనర్ అని తెలిసింది.

ఈ "దరువు" చిత్రంలో హీరో రవితేజ పాత్ర ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూనే చాలా ఎమోషనల్ గా ఉంటుందనీ యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయట. "వీర" చిత్రం తర్వాత మళ్ళీ ఈ చిత్రంలో రవితేజ సరసన తాప్సి హీరోయిన్ గా నటిస్తూంది. ఈ "దరువు" చిత్రం రానున్న వేసవి శలవులో అంటే "మే" నెలలో విడుదలవుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.