English | Telugu

"గోవింద గానామృతం" ఆడియో రిలీజ్

"గోవింద గానామృతం" ఆడియో రిలీజ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే గతంలో "చెలియా" అనే ఆల్బమ్ ని తయారుచేసిన యువ సంగీత దర్శకుడు రాజీవ్ తన మలి ప్రయత్నంగా "గోవింద గానామృతం" అనే భక్తిరస గీతాల సి.డి.ని తయారుచేశారు. జనవరి 5 వ తేదీన, ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ప్రముఖ సినీ దర్శకుడు వి.యన్.ఆదిత్య అందుకోగా ఈ "గోవింద గానామృతం" భక్తి సి.డి. మార్కెట్లోకి విడుదల చేయబడింది.

ఈ "గోవింద గానామృతం" ఆడియో విడుదలకు ప్రముఖ దర్శకులు మధుర శ్రీధర్ రెడ్డి, ప్రముఖ సినీ గీత రచయిత సిరాశ్రీ తదితరులు హాజరయ్యారు. రాజీవ్ చేసిన ఈ "గోవింద గానామృతం" చాలా బాగుందనీ, అతను భవిష్యత్తులో మంచి సినీ సంగీత దర్శకుడై రాణించాలనీ ఆహూతులంతా ఆకాంక్షించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.