Read more!

English | Telugu

దేవీరెడ్డి మృతిపై రామ్ చరణ్ భార్య స్పందన..!

హైదరాబాద్ లో ఇటీవలే మరణించిన ఇంజనీరింగ్ స్టూడెంట్ దేవీ మరణం మిస్టరీ గా మారిన విషయం తెలిసిందే. మొదట ఆమెడి యాక్సిడెంట్ అని అనుకున్నా, ఆ తర్వాత ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. ఆమెను హత్య చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దేవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని స్పందించారు. మరో భారత కూతురు ప్రాణం కోల్పోయింది. కానీ నిందితులపై ఎలాంటి చర్యలు లేవు. కేవలం డబ్బు, పలుకుబడి ఉంటే తప్పు చేసి తప్పించుకోవచ్చనుకుంటున్నారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోకుండా కలిసి పోరాడాలి. దేవికి న్యాయం జరిగేలా చేద్దాం, నిందితుల్ని శిక్షించే వరకూ పోస్ట్ ను షేర్ చేద్దాం అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు ఉపాసన. కాగా దేవీ రెడ్డి కేసు రోజురోజుకూ మరింత అనుమానాస్పదంగా మారుతోంది. పోలీసులు రోజుకో వాదన వినిపించడం, ప్రత్యక్షసాక్షులు కథనాలు భిన్నంగా ఉండటంలాంటివి అనుమానాన్ని మరింత బలపరుస్తున్నాయి.