English | Telugu

"రచ్చ" షూటింగ్ ఆపారు

"రచ్చ" షూటింగ్ ఆపారు. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"రచ్చ". ఈ "రచ్చ" చిత్రం షుటింగ్ కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక లేక్ దగ్గర హీరో రామ్ చరణ్, హీరోయిన్ త్రమన్నాలపై ఒక డ్యూయెట్ తీద్దామని దర్శకుడు సంపత్ నంది ప్లాన్ చేశాడు.

అంతా సిద్ధంగా ఉన్న సమయంలో పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ సంజయ్ కుమార్ అక్కడకు వచ్చి లైఫ్ జాకెట్ లేకుండా ఎవరినీ బోట్ లో ఆ లేక్ లోకి అనుమతించమని ఖరాఖండిగా చెప్పటంతో వళ్ళుమండిన దర్శకుడు సంపత్ నంది వెంటనే ప్యాకప్ చెప్పాడట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.