English | Telugu

రామ్ చరణ్ "రచ్చ" పాట పూర్తి

రామ్ చరణ్ "రచ్చ" పాట పూర్తి అయ్యింది. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"రచ్చ". ఈ "రచ్చ" చిత్రం టైటిల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కల గౌతమ బుద్ధుడి విగ్రహం వద్ద ఈ "రచ్చ" చిత్రం టైటిల్ సాంగ్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ "రచ్చ" చిత్రం టైటిల్ సాంగ్ షూటింగ్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో పూర్తవటం విశేషం. ఈ చిత్రం ఇప్పటికి 70% పూర్తయింది. ఏప్రెల్ నెలలో ఈ "రచ్చ" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం షుటింగ్ శ్రీలంక, చైనా దేశాల్లోనూ, ఇటీవల చెన్నైలోనూ షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.