English | Telugu

ఫ్రెండ్ కోసం సుకుమార్ ని రామ్ చరణ్ ఆపుతున్నాడా! ఫ్యాన్స్ ఏమంటారో మరి 

గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రస్తుతం 'పెద్ది'(Peddi)మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ 'బుచ్చిబాబు'(Buchibabu)దర్శకుడు. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజైన రామ్ చరణ్ లుక్, టీజర్ తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో 'పెద్ది'పై అంచనాలు పెరిగాయి. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ పలు రకాల క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఈ విషయం టీజర్ లో చరణ్ చెప్పిన డైలాగుల ద్వారా అర్థమైపోతుంది. మార్చి 27 2026 న చరణ్ బర్త్ డే సందర్భంగా పాన్ ఇండియా లెవల్లో 'పెద్ది' థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు.

ఇక ఈ మూవీ తర్వాత చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్(Sukumar)దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. దీంతో 'రంగస్థలం' కాంబినేషన్ రిపీట్ కావడం, పుష్ప 2 తో పాన్ ఇండియా లెవల్లో సుకుమార్ క్రేజ్ తెచ్చుకోవడంతో, ఆ ఇద్దరి కాంబోలో వచ్చే కథపై మరింత ఆసక్తి నెలకొని ఉంది. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ కాంబో మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. సుకుమార్ కంటే ముందు చరణ్ మరో మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉందని, దీంతో మూవీని స్టార్ట్ చెయ్యడానికి సుకుమార్ మరికొంత సమయం తీసుకోనున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే చరణ్ పెద్ది కంప్లీట్ అయిన వెంటనే మరో మూవీని ప్లాన్ చేయాలని భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. డైరెక్టర్ ని కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.


ఇక ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (uv Creations)నిర్మించబోతుందనే టాక్ కూడా బాగానే వినిపిస్తుంది. నిజానికి చరణ్,యువి బ్యానర్ లో గతంలోనే సినిమా రావాల్సి ఉంది. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్ డమ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ కింగ్ డమ్ కథని ఫస్ట్ చరణ్ కి గౌతమ్ చెప్పాడని, యువి నే ఆ చిత్రాన్ని నిర్మించాల్సి ఉందనే వార్తలు బాగానే వినిపించాయి. యువి ప్రస్తుతం చిరంజీవి(Chiranjeevi)తో విశ్వంభర చేస్తుంది. ఈ మూవీ తర్వాత చరణ్ మూవీనే స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. యువి అధినేతల్లో ఒకరైన వంశీ రెడ్డి, చరణ్ క్లాస్ మేట్స్ తో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ .


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.