English | Telugu

చెర్రీ గోవిందుడు అందరివాడేనా..!

చిరంజీవి హీరోగా "అందరివాడు" అనే చిత్రం తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు గోవిందుడు పాత్రలో కనిపించడమే కాకుండా... "గోవిందుడు అందరివాడు..." అంటూ ఒక పాట కూడా వేసుకున్నాడు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన "బృందావనం" సినిమాకు "గోవిందుడు అందరివాడేలే" అనే క్యాప్షన్ పెట్టుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక స్టైలిష్ చిత్రంగా "బృందావనం" నిలిచింది.

అయితే ప్రస్తుతం ఈ గోవిందుడు పేరును చిరు తనయుడు చరణ్ కూడా వాడుకుంటున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు "గోవిందుడు అందరి వాడేలే" అనే టైటిల్ ను ఖరారు చేసారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. ఈనెల 26 నుంచి హైదరాబాద్ లోని రామానాయుడు సినీవిలేజ్ లో సెట్ వర్క్ కూడా మొదలు పెట్టనున్నారు. ఇందులో చరణ్ అన్న పాత్రలో నటుడు శ్రీకాంత్ నటించనున్నాడు. చరణ్ కు జోడిగా మూడోసారి కాజల్ అగర్వాల్ జతకట్టనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.