English | Telugu

రామ్ చరణ్ ద్విపాత్రాభినయం

రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వివరాల్లోకి వెళితే యువ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఈ చిత్రానికి రామ్ చరణ్ మాతృమూర్తి శ్రీమతి సురేఖ క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి ప్రముఖ కథా రచయిత ఆకుల శివ ఒక అద్భుతమైన కథనందించారట.

అన్నపూర్ణ స్టుడియోలో ప్రారంభమైనప్పుడు ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలూ ఉంటాయని ఈ చిత్రం మీడియాకు తెలిపింది. అలాగే ప్రస్తుతం హీరో రామ్ చరణ్ తొలిసారిగా ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించనున్నాడట. ఈ చిత్రంలో తనకు నటనకు అవకాశమున్న పాత్ర లభించిందని హీరో రామ్ చరణ్ ఆనందపడుతున్నారట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.