English | Telugu

మెగా ఫ్యామిలీ రెండుగా విడిపోయినట్లేనా..?

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని, త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడని వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మెగా కుటుంబసభ్యులు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే ఈ విషయంపై మెగా కుటుంబ సభ్యుడు, హీరో రాంచరణ్ స్పందించాడు. "నా సపోర్ట్ ఎప్పుడు నాన్నకే. ఎవరి దారి వారిదే. నా దారి నాదే.. బాబాయ్ దారి బాబాయ్ దే. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు" అని తెలిపారు.

చరణ్ మాట్లాడిన విధానం చూస్తుంటే మెగా ఫ్యామిలీలో చీలిక ఏర్పడినట్లే అని అర్థమవుతుంది. ప్రస్తుతం నాగబాబు, పవన్ కళ్యాణ్ ఒకవైపు. చిరంజీవి, రాంచరణ్, అల్లు అరవింద్ ఒక వైపు అన్నట్లుగా ఉంది. మరి పవన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా లేదా అనే విషయం మార్చి14వ తేదిన మాదాపూర్ లో ప్రకటించనున్నాడు. మరి పవన్ పార్టీ పెడితే మెగా అభిమానులు కూడా రెండు భాగాలుగా చీలిపోతారు కావచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.