English | Telugu

ఢిల్లీ భామకి ఫుల్ డిమాండ్

'రకుల్ ప్రీత్ సింగ్' ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకొ౦టుంది. గోపీచంద్ సరసన 'లౌక్యం', రామ్ సరసన 'పండుగ చేస్కో', మంచు మనోజ్ సరసన 'కరెంట్ తీగ', ఆది సరసన 'రఫ్' చిత్రాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మరో భారీ ఆఫర్ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. మాస్ మహరాజా రవితేజ సరసన నటించే అవకాశం రకుల్ కి దక్కిందని తెలుస్తోంది. రవితేజ తో నటిస్తుండడంతో ఈ సారి రకుల్ టాలీవుడ్ పెద్ద హీరోల దృష్టిలో పడుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ ఆఫర్ ను తలచుకుని ఈ బ్యూటీ తెగమురిసిపోతుందట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.