English | Telugu

రాజమౌళి Vs శంక‌ర్‌

ఇది వ‌ర‌కు సౌత్ ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడంటే శంక‌ర్ పేరు చెప్పుకొనేవారు. మ‌గ‌ధీర వ‌రకూ అగ్ర ద‌ర్శ‌కుల జాబితాలో రాజ‌మౌళి ప్ర‌స్తావ‌నే ఉండేది కాదు. రోబోతో యావ‌త్ భార‌తీయ చిత్ర‌సీమని త‌న‌వైపుకు తిప్పుకొన్నాడు శంక‌ర్‌. ఐకి ముందూ ఇంతే! హాలీవుడ్ సినిమాని త‌ల‌ద‌న్నే సినిమా తీసుంటాడ‌ని శంక‌ర్ గురించి ఆశించారు. అయితే.. ఈ సినిమాతో శంక‌ర్ నిరాశ‌పరిచాడు. శంక‌ర్ కూడా ఒక్కోసారి మామూలు ద‌ర్శ‌కుల్లానే త‌ప్పులు చేస్తాడ‌ని ఈ సినిమా నిరూపించింది. దానికి తోడు బాహుబ‌లితో శంక‌ర్‌ని దాటుకొంటూ వ‌చ్చేశాడు రాజ‌మౌళి. తెలుగు సినిమాకి రూ.500 కోట్ల క్ల‌బ్‌లో చేర్చేస్తాడేమో అన్నంత రేంజులో బాహుబ‌లి వ‌సూళ్లు సాగుతున్నాయి. రాజమౌళి హ‌వాతో శంక‌ర్ ప‌ర‌ప‌తి కాస్త త‌గ్గిన మాట వాస్త‌వం. ఈ సంగ‌తి శంక‌ర్‌కీ తెలుసు. అందుకే రోబో 2తో విమ‌ర్శ‌కుల‌కు గ‌ట్టి స‌మాధానం చెప్పాల‌ని నిర్ణ‌యించుకొన్నాడ‌ట‌.

రోబో 2ని భార‌తీయ చ‌ల‌న చిత్ర‌ప‌రిశ్ర‌మ క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా రూపొందించాల‌ని శంక‌ర్ గట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం రూ.250 కోట్ల బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అటు త‌మిళ వ‌ర్గాలనే కాదు, యావ‌త్ భార‌తీయ చ‌ల‌న చిత్ర‌సీమ‌నూ షాక్‌కి గురిచేస్తున్నాయి. బాహుబ‌లి రెండు భాగాల‌కూ పెట్టిన పెట్టుబ‌డి అది. ఒక్క సినిమాకే శంక‌ర్ రూ.250 కోట్లు ఖ‌ర్చు పెట్టాల‌ని చూడ‌డం.. అత‌ని గ‌ట్స్‌కి నిద‌ర్శ‌నం. అయితే బాహుబ‌లి వేరు, రోబో 2 వేరు! బాహుబ‌లి స్ట్రాట‌జీ వేరు, రోబో 2 వేరు. అయితే ఈ లెక్క‌లేం ప‌ట్టించుకోకుండా శంక‌ర్ భారీ మొత్తంతో ఈ సినిమా తీయ‌డం ప‌రిశ్ర‌మ‌కు షాక్‌కి గురిచేసే విష‌యమే.

సినిమాలో ద‌మ్ముంటే ఎన్ని వ‌సూళ్ల‌యినా సాధించుకోవ‌చ్చ‌ని బాహుబ‌లి నిరూపించింది. బాహుబ‌లి స్ఫూర్తితోనే శంక‌ర్ కూడా ఈ సాహ‌సానికి ఒడిగ‌డుతున్నాడు. మ‌రి ఈ సినిమాతో శంక‌ర్ రాజ‌మౌళికి పోటీ ఇస్తాడా? మ‌ళ్లీ సౌత్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడిగా కితాబులు అందుకొంటాడా?? వేచి చూడాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.