English | Telugu

బ‌న్నీ, అజిత్‌తో రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌??

టాలీవుడ్‌కి ఇది దిమ్మ‌తిరిగిపోయే న్యూస్ ఇది. బాహుబ‌లి 2 త‌ర‌వాత రాజ‌మౌళి ఎవ‌రితో సినిమా చేస్తాడ‌న్న విష‌యంలో దాదాపుగా ఓ క్లారిటీ వ‌చ్చింది. ఈసారి రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌డానికి స్కెచ్ వేస్తున్నాడ‌ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందే ఈ చిత్రంలో క‌థానాయ‌కులుగా అల్లు అర్జున్‌, అజిత్‌ల‌ను ఎంచుకొన్నాడ‌ట‌.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ రాసిన క‌థ ఇద్ద‌రు హీరోల్ని డిమాండ్ చేస్తోంద‌ని టాక్‌. తెలుగులో బ‌న్నీ, త‌మిళంలో అజిత్ ల వ‌ల్ల ఈ సినిమా మార్కెట్ అనూహ్యంగా పెరుగుతుంద‌ని రాజ‌మౌళి ప్లాన్‌. సెప్టెంబ‌రులో బాహుబ‌లి 2 మొద‌లువుతుంది. 2016 వేస‌విలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ త‌ర‌వాత ఈ మ‌ల్టీస్టార‌ర్ ని సెట్స్‌పైకి తీసుకెళ్తార‌ని టాక్‌.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.