English | Telugu

'రాధే శ్యామ్' దర్శకుడికి యూవీ మరో ఛాన్స్.. హీరో ఎవరో తెలుసా?

ఘోర పరాజయం తర్వాత యువ దర్శకులకు మరో అవకాశం రావడం అంత తేలిక కాదు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పరిస్థితి అలాంటిదే. రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన 'రాధే శ్యామ్' విడుదలై ఏడాది దాటిపోయినా ఇంతవరకు ఆయన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఓ కోలీవుడ్ హీరో ఆయనతో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

గోపీచంద్ హీరోగా నటించిన 'జిల్' సినిమాతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ.. తన స్టైలిష్ మేకింగ్ తో రాధాకృష్ణ ఆకట్టుకున్నాడు. దీంతో 'జిల్' చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ ఆయనకు ఏకంగా ప్రభాస్ తో 'రాధే శ్యామ్' చేసే అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఆ అవకాశాన్ని రాధాకృష్ణ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందిన 'రాధే శ్యామ్' ఘోర పరాజయం పాలైంది. దీంతో దర్శకుడిగా మూడో సినిమా అవకాశం కోసం రాధాకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మధ్య గోపీచంద్ తో మరో సినిమా చేయనున్నాడని న్యూస్ వినిపించింది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ పేరు కూడా వినిపించింది. ఇక ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో విశాల్ పేరు తెరపైకి వచ్చింది.

విశాల్ కి తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే విశాల్ తో రాధాకృష్ణ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే రాధాకృష్ణ ఒక కథ వినిపించడం, అది విశాల్ కి నచ్చడం కూడా జరిగిపోయాయట. అంతేకాదు ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం. 'జిల్' హిట్ కాకపోయినా, 'రాధే శ్యామ్' డిజాస్టర్ గా నిలిచినా.. దర్శకుడిగా రాధాకృష్ణకు వరుసగా మూడో అవకాశం ఇవ్వడానికి యూవీ సిద్ధపడటం ఆసక్తికరంగా మారింది. మరి మూడో సినిమాతో అయినా రాధాకృష్ణ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.