English | Telugu

"రచ్చ" ఆడియో ఫిబ్రవరి 26 న కర్నూల్ లో

రచ్చ" ఆడియో ఫిబ్రవరి 26 న కర్నూల్ లో విడుదల కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "రచ్చ". ఈ "రచ్చ" చిత్రం షూటింగ్ శ్రీలంక, చైనా దేశాల్లో జరిపారు. అలాగే మన దేశంలో కేరళ, హైదరాబాద్ వంటి వివిధ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది "రచ్చ" చిత్రం.

ఈ "రచ్చ" చిత్రం ఆడియోని ముందుగా ఫిబ్రవరి 20 వ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేయాలని ఈ చిత్రం యూనిట్ అనుకుంది. కానీ మార్చ్ 26 వ తేదీన కర్నూల్ లో ఈ "రచ్చ" చిత్రండియో విడుదల కాబోతూందని తెలిసింది.ఇప్పటికే లీకైన "రచ్చ" చిత్రంలోని టైటిల్ సాంగ్ కి మంచి స్పందన లభించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.