English | Telugu
"రచ్చ" ఆడియో ఫిబ్రవరి 26 న కర్నూల్ లో
Updated : Feb 5, 2012
రచ్చ" ఆడియో ఫిబ్రవరి 26 న కర్నూల్ లో విడుదల కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "రచ్చ". ఈ "రచ్చ" చిత్రం షూటింగ్ శ్రీలంక, చైనా దేశాల్లో జరిపారు. అలాగే మన దేశంలో కేరళ, హైదరాబాద్ వంటి వివిధ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది "రచ్చ" చిత్రం.
ఈ "రచ్చ" చిత్రం ఆడియోని ముందుగా ఫిబ్రవరి 20 వ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేయాలని ఈ చిత్రం యూనిట్ అనుకుంది. కానీ మార్చ్ 26 వ తేదీన కర్నూల్ లో ఈ "రచ్చ" చిత్రండియో విడుదల కాబోతూందని తెలిసింది.ఇప్పటికే లీకైన "రచ్చ" చిత్రంలోని టైటిల్ సాంగ్ కి మంచి స్పందన లభించింది.