English | Telugu

పూరీ ఆగలేకపోతున్నాడట..!!

ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌ల కొడుకుల టార్గెట్‌ కూడా హీరో కావడమే. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కొడుకు పూరి ఆకాశ్‌ హీరో అవుతాడని చిన్నప్పుడే తేలిపోయింది. బాలనటుడిగా చాలా సినిమాల్లో నటించిన ఆకాశ్‌.. మధ్యలో ‘ధోని’ సినిమాలో లీడ్‌ రోల్‌ చేశాడు.

ఇప్పుడు అతను కథానాయకుడిగా ‘ఆంధ్రా పోరి’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు కొడుకు సినిమా చూడలేకపోయిన పూరి.. రెండో రోజు థియేటర్‌కే కొడుకు నట విన్యాసాలు చూశాడట. నా కొడుకు అదరగొట్టేశాడంటూ ఆనందంగా చెబుతున్నాడు పూరి.

"ఆంధ్రాపోరి మరాఠీ మాతృక చూసినపుడు అందులో కథానాయకుడు చాలా బాగా చేశాడని.. అంతకంటే బాగా చేయాలని ఆకాశ్‌కు చెప్పా. ఐతే ఆంధ్రాపోరిలో ఆకాశ్‌ నటన చాలా సంతృప్తికరంగా అనిపించింది. క్లైమాక్స్‌ సీన్‌లో ఆకాశ్‌ చాలా మంచి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. నిజానికి ఆకాశ్‌ను మూడేళ్ల తర్వాత హీరోగా ఇంట్రడ్యూస్‌ చేద్దామనుకున్నా. కానీ ఈ సినిమా చూశాక అర్జెంటుగా అతడు హీరోగా సినిమా చేయాలనిపిస్తోంది. ఆంధ్రాపోరి మంచి లవ్‌స్టోరీ రాజ్‌ మాదిరాజు చాలా బాగా తీశాడు. మంచి మెసేజ్‌ కూడా ఇచ్చాడు” అని చెప్పాడు పూరి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.