English | Telugu

ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలి!

చిత్ర పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ వెబ్‌సైట్‌ను ఎట్టకేలకు క్లోజ్‌ చేయించారు పోలీసులు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్‌ చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపేందుకు చిత్ర ప్రముఖులు ఫిలిం ఛాంబర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్‌భూషణ్‌, నిర్మాతలు సి.కళ్యాణ్‌, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్‌, వల్లభనేని అనిల్‌ కుమార్‌, బాపిరాజు, వీరశంకర్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘దేశం మొత్తంలో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే పైరసీ సెల్‌ను మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. ఈ పైరసీని అరికట్టేందుకు మన పోలీసులతోపాటు విదేశీ పోలీసులు కూడా సహకారం అందించారు. ఎంతో కష్టపడి ఐ బొమ్మ రవిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిశ్రమకు ఇంత నష్టం కలిగించిన రవిని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలి. ఇది కడుపు మంటతో అంటున్న మాట. ప్రేక్షకులకు పైరసీ గురించి మరింత అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. దాని వల్ల చిత్ర పరిశ్రమకు ఎంత నష్టం జరుగుతుందీ అనేది వారికి అర్థమయ్యేలా చెప్పాలి’ అన్నారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘టికెట్‌ ధరలు ఎక్కువ ఉండడం వల్ల పైరసీలో సినిమాలు చూస్తున్నారని అందరూ అంటున్నారు. కానీ, దీని వల్ల చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. క్యూబ్‌, యుఎఫ్‌ఓ ద్వారానే పైరసీ అనేది బయటికి వస్తోంది అనే విషయం అర్థమవుతోంది. కాబట్టి ఆయా సంస్థలు తమ సర్వర్లు స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇకముందు సినిమాలు బయటకు వెళితే కచ్చితంగా వారే దానికి బాధ్యత తీసుకోవాలి’ అన్నారు.

వల్లభనేని అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘ఈమధ్యకాలంలో సినిమాలు ఎక్కువగా విజయం సాధించడం లేదు. దానికి ముఖ్యమైన కారణం పైరసీ. తెలంగాణ ప్రభుత్వం పైరసీని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పైరసీ చేసేవారిని పట్టుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు టికెట్‌ ధరలు నిర్ణయించాలి. కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు రావాలంటే పైరసీని అరికట్టడం ఒక్కటే మార్గం’ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.