English | Telugu

ప్రకాష్‌రాజ్‌ కు తప్పిన ప్రమాదం

ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రకాష్ రాజ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ లో పాల్గొని తిరిగి వస్తుండగా మాదాపూర్‌లో ఆయన కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆయన కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ప్రకాష్‌రాజ్‌ చిన్న గాయలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ, ''ఆర్టీసీ బస్సు నా కారుతోపాటు ఒక ఆటోని కూడా ఢీకొంది. అక్కడ గుమికూడిన కొంతమంది యువకులు ఆటోలో వున్నవారిని కాపాడే విషయాన్ని పక్కన పెట్టేసి, సెల్ ఫోన్‌లతో నన్ను ఫొటోలు తీయడంలో నిమగ్నమయ్యారు. నా ప్రాణాల మీద భయం కంటే మనుషుల ప్రవర్తన పట్ల భయమేసిందని, మనం ఎక్కడికి పోతున్నామంటూ నన్ను నేనే నిందించుకోవాల్సి పరిస్థితి వచ్చిందని'' అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.