English | Telugu

రాజమౌళి మేలే చేస్తున్నాడా ?

ప్రభాస్ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. అంతగా బాగుండని "రెబల్" కూడా మంచి కలెక్షన్లే సాధించగా.. "మిర్చి" కలెక్షన్లు ఘాటెక్కించాయి. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఆ చిత్రం అనంతరం రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించడం ప్రస్తుతానికైతే ప్రభాస్ పాలిట శాపంగా మారింది. ఎందుకంటె "మిర్చి" విడుదలై ఆరు నెలలు కావస్తున్నా.. రాజమౌళి దర్శకత్వం వహించే "బాహుబలి" సెట్స్‌పైకి రాలేదు. షూటింగ్ ప్రారంభమైన తర్వాత.. ఫినిష్ కావడానికి మినిమం ఆరేడునెలలు పట్టినా ఆశ్యర్యం లేదు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం మరో నాలుగైదు నెలలు తీసుకొంటాడు రాజమౌళి. ఈ ఏడాది ప్రభాస్ సినిమా మరొకటి రాదు. "మిర్చి" విడుదలైన సంవత్సరంన్నరకు కాని "బాహుబలి" ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు.


ఈ నేపధ్యంలో ప్రభాస్‌కు రాజమౌళి మేలు చేస్తున్నాడా.. లేడు కీడు చేస్తున్నాడా? అనే ఆసక్తికర చర్చ ఫిలింనగర్‌లో జోరుగా జరుగుతోంది. "మిర్చి" తర్వాత ప్రభాస్ వెంటనే మరో చిత్రం చేసి ఉండాల్సిందని.. అత్యంత అధునాతన మేకప్ అందుబాటులో ఉండగా.. గెడ్డాలు, మీసాలు, జుత్తు పెంచుకోవడం కోసం ఆరు నెలల అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవడం సరికాదని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. "మిర్చి" షూటింగ్ పూర్తయిన వెంటనే.. మరో సినిమా మొదలెట్టి ఉంటే.. ఆ చిత్రం ఈపాటికి విడుదలకు సిద్ధంగా ఉండేదని.. అప్పుడు సినిమాకు సినిమాకు మధ్య మరీ అంత గ్యాప్ వచ్చి ఉండేది కాదని వారందరూ తెగ బాధపడుతున్నారు!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.