Read more!

English | Telugu

ప్రభాస్ మూవీలో నితిన్ లేడు - రాజమౌళి

"ప్రభాస్ మూవీలో నితిన్ లేడు" అని ప్రముఖ యువ దర్శకుడు రాజమౌళి అన్నారు. వివరాల్లోకి వెళితే యమగ్‍ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ తదితరులు నిర్మిస్తున్న భారీ జానపద చిత్రంలో యువ హీరో నితిన్ సెంకండ్ హీరోగా నటిస్తున్నాడని ఈ మధ్య మీడియాలో వార్తలొచ్చాయి. వాటిని గమనించిన దర్శకుడు రాజమౌళి దీన్ని తీవ్రంగా ఖండించారు.

"కాస్తో కూస్తో పరువూ, నిజాయితీ ఉన్న ఛానల్స్ కూడా ఇలా ఏ విధమైన ఆధారాల్లేని వార్తలు ప్రచారం చేయటం దురదృష్టకరం. నేను కానీ, నా నిర్మాతలు కానీ ఏనాడన్నా నితిన్ ఈ సినిమాలో నటిస్తున్నాడని ఎవరికైనా చెప్పామా...? లేదే...! మరి ఆ సినిమాలో నితిన్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడని నిరాధారమైన వార్తల్ని ప్రసారం చేయటం శోచనీయం. ఆ సినిమాలో ప్రభాస్ ఒక్కడే హీరో. నితిన్ ఆ సినిమాలో నటించటం లేదు" అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి "ఈగ" సినిమాతోనూ, ప్రభాస్ "రెబెల్" సినిమాతోనూ బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలూ పూర్తి కాగానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లోని భారీ జానపద చిత్రం నవంబర్ నెలలో ప్రారంభమవుతుంది.