Read more!

English | Telugu

ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రానికి సెన్సార్ పూర్తి

ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రానికి సెన్సార్ పూర్తయిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్నచిత్రం"మిస్టర్ పర్ ఫెక్ట్". ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రానికి సెన్సార్ వారు "యు" సర్టిఫికేట్ ఇచ్చారట.

ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రంలో హీరో ప్రభాస్ వీడియో గేమ్స్ తయారు చేసే కంపెనీ యజమానిగా, కాజల్ కబడ్డీ చిట్టిగా గ్రామీణ యువతి పాత్రలోనూ, తాప్సి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానూ నటిస్తున్నారట. ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రమ ఆడియోకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తూందని తెలిసింది.

 

ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం యువతీ యువకులకు కుటుంబకథా చిత్రాల ప్రేక్షకులకూ ఇలా అందరికీ, అన్ని వర్గాల వారికీ నచ్చే విధంగా తయారుచేశామని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు అంటున్నారు. ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఏప్రెల్ 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.