Read more!

English | Telugu

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..

అభిమానుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని ఎప్పుడూ చెప్పే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఆ మాటను నిలబెట్టుకున్నారు. పవన్ వీరాభిమాని నితన్-సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' ఆడియో వేడుకకు పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అంతకు ముందు ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్టు నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శిల్పకళావేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని నితిన్ ప్రకటించారు.