English | Telugu

బయటపడిన పొలిమేర 2, గుంటూరు కారానికి మధ్య ఉన్న రిలేషన్

ఇటీవల వచ్చిన మా ఊరి పొలిమేర 2 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. చిన్న చిత్రంగా విడుదల అయిన ఆ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించింది. ఆ సినిమా ప్రేక్షకులకి చేరువయ్యేలా మంచి థియేటర్స్ లో రిలీజ్ చేసిన వారు వంశీ నందిపాటి, ధీరజ్ మొగిలినేని. ఈ ఇద్దరే పొలిమేర 2 ని వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేసారు. తాజాగా ఇప్పుడు ఒక అగ్ర హీరో సినిమాకి ఆ ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ గుంటూరు కారంని కృష్ణ జిల్లా వ్యాప్తంగా పంపిణి చేసే హక్కులని వంశీ నందిపాటి, ధీరజ్ మొగిలినేని లు దక్కించుకున్నారు.అలాగే తేజ సజ్జా హీరోగా వస్తున్న హనుమాన్ ని కూడా ఈ ఇద్దరే కృష్ణ జిల్లాలో పంపిణి చెయ్యబోతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని వంశీ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేసాడు. అలాగే ఆ రెండు సినిమాలని తమ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని కూడా వంశీ .అన్నాడు.

గుంటూరు కారం రిలీజ్ హక్కుల కోసం ఎంతోమందిప్రయత్నించినా కూడా పొలిమేర 2 ని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు పొందటం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ రేట్ ని చెల్లించి వంశీ ఆ హక్కులని సంపాదించాడని తెలుస్తుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.