Read more!

English | Telugu

జనతాగ్యారేజ్ ప్రొడ్యూసర్లకు షాక్ ఇచ్చిన పవన్..!

శ్రీమంతుడు సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి, పెద్ద నిర్మాణసంస్థగా పేరు తెచ్చుకంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ప్రొడక్షన్ నెం 2 గా ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ నిర్మిస్తోంది. తమ బ్యానర్ పై పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేయడానికి వాళ్లిద్దరితో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చిందట ఈ సంస్థ. కానీ ఏమైందో ఏమో, పవన్ అండ్ త్రివిక్రమ్ ఇద్దరూ కూడా అడ్వాన్స్ తిరిగిచ్చేశారట. కారణాలేమిటో ఖచ్చితంగా తెలియనప్పటికీ, పవన్ సొంత బ్యానర్లోనే ఆ సినిమా చేయాలనుకోవడమే అందుక్కారణమని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ అండ్ పవన్ కాంబినేషన్లో మంచి క్రేజీ సినిమా మిస్సైంది శ్రీమంతుడు నిర్మాణ సంస్థ. ప్రస్తుతం పవన్ ఎస్.జే.సూర్య సినిమాపై దృష్టి సారించాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ పవన్ సినిమా ఉండబోతోందని సమాచారం.