English | Telugu

మళ్లీ వార్త‌ల్లోకి 'కోబ‌లి'

అత్తారింటికి దారేది త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ ల క‌ల‌యిక మ‌ళ్లీ చూసే అవ‌కాశం ద‌క్క‌నుందా?? వీళ్లిద్దరూ హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారా?? ఔన‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్‌ల క‌ల‌ల చిత్రం కోబ‌లి త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కోబ‌లి సెట్స్‌పైకి వెళ్ల‌డం ఖాయం అనిపిస్తోంది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర‌వాత త్రివిక్ర‌మ్ మ‌హేష్ బాబుతోఓ సినిమా చేయాల్సివుంది. అయితే మ‌హేష్‌.. బ్ర‌హ్మోత్స‌వం సినిమాతో బిజీ అయిపోయాడు. మ‌రోవైపు గ‌బ్బ‌ర్ సింగ్ 2 ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ఆ ప్రాజెక్టు ఇంకా స్ర్కిప్టు ద‌శ‌లో ఉంది. అటు బ్ర‌హ్మోత్స‌వం, ఇటు గ‌బ్బ‌ర్ సింగ్ 2 స్ర్కిప్టు పూర్త‌య్యేలోగా... ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌లు క‌ల‌సి కోబ‌లిని పూర్తి చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. దానికి తోడు హిట్ కాంబినేష‌న్. `కోబ‌లి` సినిమా ప‌వ‌న్‌తో తీస్తా.. అని ఇది వ‌ర‌కు త్రివిక్ర‌మ్ ప్ర‌క‌టించాడు కూడా. సో... కోబ‌లి మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన ఓ శుభ‌వార్త వినొచ్చు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.