English | Telugu

ఓజీ ఆగమనం.. డేంజర్ లో ఆర్ఆర్ఆర్, పుష్ప-2 రికార్డులు!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయం. అయితే కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేక, తన స్టార్డంకి తగ్గ సినిమాలు పెద్దగా చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేసేలా 'ఓజీ' వస్తోంది. (They Call Him OG)

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మోస్ట్ హైప్డ్ మూవీ 'ఓజీ' అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ మూవీ.. సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇక తెలుగునాట బుకింగ్స్ ఓపెన్ అయితే.. సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్ లో నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు

ట్రేడ్ వర్గాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా మూడే మూడు సినిమాలు మొదటి రోజు రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. రూ.74 కోట్ల షేర్ తో 'ఆర్ఆర్ఆర్' టాప్ లో ఉండగా.. రూ.70 కోట్ల షేర్ తో 'పుష్ప-2', రూ.61 కోట్ల షేర్ తో 'దేవర' ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. 'ఓజీ' మూవీ తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్'లను దాటుకొని, టాప్ పొజిషన్ కి వెళ్తుందా అనేదే ఇక్కడ ఆసక్తికరం.

'పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో ప్రస్తుతం 'ఓజీ'పై అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆకలితో ఉన్నారు. పైగా, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అదనపు షోలకు, అదనపు టికెట్ ధరలకు అనుమతి లభించింది. మిడ్ నైట్ షో ఒక్కో టికెట్ ధర వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణలో కూడా టికెట్ హైక్ కి అనుమతి లభించే ఛాన్స్ ఉంది. అసలే భారీ హైప్, పైగా అదనపు టికెట్ ధరలు, దానికితోడు ఇతర భారీ సినిమాల నుంచి పోటీ కూడా లేదు. సెప్టెంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ 'ఓజీ' మయం అవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ లెక్కన తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే షేర్ పరంగా.. పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలను 'ఓజీ' క్రాస్ చేసినా ఆశ్చర్యంలేదు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.