English | Telugu

యన్ టి ఆర్ హీరోగా శ్రీనువైట్ల చిత్రం ఫిబ్రవరిలో

యన్ టి ఆర్ హీరోగా శ్రీనువైట్ల చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతుందని ఆ చిత్రం యూనిట్ తెలిపింది. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో, యువ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం 2012 ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చ్ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. "బృందావనం"చిత్రం తర్వాత యన్ టి ఆర్, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే.

కాజల్ ప్రస్తుతం "బిజినెస్ మ్యాన్" చిత్రంలో నటించింది. హీరో యన్ టి ఆర్ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలోని "దమ్ము" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల చెప్పిన కథ హీరో యన్ టి ఆర్ కు బాగా నచ్చిందని నిర్మాత గణేష్ తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.