English | Telugu

టెంప‌ర్ బ‌డ్జెట్ ఎంత‌??

ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో తొలిసారి రూ.50 కోట్ల మైలు రాయికి చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని ఎన్టీఆర్ అభిమానులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. తొలి మూడు రోజుల‌కూ రూ.18 కోట్ల‌కు పైనే వ‌సూలు చేసింది టెంప‌ర్‌. ఈ జోరు మ‌రో వారం కొన‌సాగే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ర‌మార‌మీగా ఈ సినిమా రూ.40 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేయొచ్చు. త‌దుప‌రి సినిమాలేం బాగోక‌పోతే, ఎన్టీఆర్ మానియా రోజు రోజుకీ పెరిగితే త‌ప్ప రూ.50 కోట్లు కొల్ల‌గొట్ట‌డం సాధ్యం కాదు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఎన్టీఆర్ సినిమా రూ.40 కోట్లు చేసినా.. హిట్టుకిందే లెక్క‌. అయితే టెంప‌ర్ బ‌డ్జెట్ ఎంత‌? ఈ సినిమాకి ఎంత ఖ‌ర్చ‌య్యింది? అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది టాలీవుడ్‌లో. ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ సినిమాలు చూసినా, పూరి సినిమాలు చూసినా అందులో భారీద‌నం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించేవి. భారీ ఛేజ్లూ, సెట్లూ చూసేవాళ్లం. టెంప‌ర్‌లో మాత్రం.. అవేం క‌నిపించ‌లేదు. వీలైనంత త‌క్కువ బడ్జెట్‌లో ఈ సినిమాని పూర్త‌చేయాల‌ని భావించింది చిత్ర‌బృందం. అయినా స‌రే.. ఈ సినిమాకి దాదాపుగా రూ.40 కోట్లు ఖ‌ర్చ‌యింది అంటున్నాడు బండ్ల గ‌ణేష్‌. వ‌డ్డీలతో క‌లుపుకొని దాదాపుగా రూ.43 కోట్ల వ‌ర‌కూ అయ్యింద‌ట‌. అంటే టెంప‌ర్ టార్గెట్ రూ.43 కోట్లు. ఈ మార్క్‌ని చేరుకొంటే సినిమా లాభాల్లో ప‌డిన‌ట్టే. ఎందుకంటే.. శాటిలైట్ రూపంలో ఇప్ప‌టికే రూ.7.5 కోట్లు అందాయి. సో.. టెంప‌ర్ రూ.40 కోట్ల మార్క్ చేరినా గ‌ణేష్ హ్యాపీనే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.