Read more!

English | Telugu

యన్ టి ఆర్ సరసన మళ్ళీ ప్రియమణి

యన్ టి ఆర్ సరసన మళ్ళీ ప్రియమణి నటిస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా నటించగా, అపజయమెరుగని యువ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ "యమదొంగ"లో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. "యమదొంగ" చిత్రంలో "రబ్బరు గాజులు" పాటలో వీళ్ళిద్దరి జంటను ప్రేక్షకులు చాలా ఆనందించారు. ఆ తర్వాత మరోసారి యన్ టి ఆర్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించబోతోంది.

క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యన్ టి ఆర్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, బోయపాటి శీను దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత కె.యస్.రామారావు నిర్మిస్తున్న"పులి" చిత్రంలో ప్రియమణి కూడా హీరోయిన్ గా ఎన్నికయ్యిందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఈ చిత్రంలో యన్ టి ఆర్ పాత్ర చాలా శక్తివంతమైందనీ, ఇద్దరు హీరోయిన్లతో యన్ టి ఆర్ పాత్ర ప్రేక్షక జనరంజకంగా ఉంటుందనీ సినీ పండితులంటున్నారు. బాబాయ్ బాలకృష్ణను "సింహా"గా చూపించిన బోయపాటి అబ్బాయ్ యన్ టి ఆర్ ని ఇంకెలా చూపిస్తాడో మరి.