English | Telugu

మరో బృందావనం సిద్ధం చేస్తున్న వంశీ


నాగార్జున, ఎన్టీఆర్ కలయికలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది. "ఎవడు" చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని సమాచారం. వంశీ చెప్పిన కథ నాగ్, ఎన్టీఆర్ లకు బాగా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలిసింది.


వంశీ, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన "బృందావనం" సినిమాలో తారక్ ను చాలా కొత్తగా చూపించాడు వంశీ. మరి ఈ తాజా చిత్రంలో ఎన్టీఆర్ ను కొత్త లుక్ లో చూపించడంతో పాటుగా, అభిమానులు కోరుకునే అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేసాడట వంశీ.

నాగార్జున కూడా ఇప్పటివరకు చేసిన "గ్రీకువీరుడు", "భాయ్" వంటి చిత్రాలు మాస్ పరంగా సరైన విజయాన్ని అందుకోలేకపోయాయి. అందుకే నాగార్జున ని ఇందులో మాస్ ఇమేజ్ పాత్రలో చూపించబోతున్నాడట వంశీ.

ఈ ప్రాజెక్ట్ కోసం వంశీ చాలా కేర్ తీసుకుంటున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం "రభస" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.