English | Telugu

యన్.టి.ఆర్. "దమ్ము"ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 14 న

యన్.టి.ఆర్. "దమ్ము"ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, త్రిష, కార్తీక నాయర్ హీరోయిన్లుగా, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో, యువ నిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"దమ్ము". ఈ యన్.టి.ఆర్. "దమ్ము"ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 14 న అంటే వాలెంటైన్స్ డే సందర్భంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అలాగే ఈ యన్.టి.ఆర్. "దమ్ము" చిత్రం యొక్క ట్రైలర్స్ నీ, ఆడియోనీ మార్చి నెలలో విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

ఈ యన్.టి.ఆర్. "దమ్ము" చిత్రం ప్రతీకారం నేపథ్యంలో అనేక మలుపులతో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమని సమాచారం. ఈ యన్.టి.ఆర్. "దమ్ము" చిత్రం యొక్క ఒక పాట చిత్రీకరణ కోసం ఈ చిత్రం యూనిట్ ప్రస్తుతం పొల్లాచ్చిలో ఉంది. ఈ యన్.టి.ఆర్. "దమ్ము" చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. యన్.టి.ఆర్., బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ "దమ్ము" చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.