English | Telugu

ఎన్టీఆర్ అప్ డేట్ ఇవ్వాల్సిందే! 

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)నుంచి సినిమా వస్తుంటే, బాక్స్ ఆఫీస్ ఏ విధంగా కలకలలాడుతుందో, ఈ నెల 14 న 'వార్ 2'(War 2)తో మరోసారి నిరూపించాడు. టాక్ తో సంబంధం లేకుండా తెలుగులో బాగానే కలెక్షన్స్ ని రాబట్టింది. ఎన్టీఆర్ వల్లనే ఆ విధంగా సాధ్యమయ్యింది. ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ 'ప్రశాంత్ నీల్'(Prashanth Neel)తో చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నుంచి వస్తున్న ఈ 31 వ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రం గత ఏడాది ఆగస్ట్ లో పూజాకార్యక్రమాలతో ప్రారంభమవ్వగా,రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. మూవీలోని మిగతా నటీనటులపై సన్నివేశాలని చిత్రీకరించారు.ఏప్రిల్ 22 న ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అవ్వగా, కర్ణాటకలోని మంగుళూరులో వేసిన ఒక భారీ సెట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించారు. ఆ తర్వాత చిత్రం గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తు మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఉండాలని, ఎంత పెద్ద సినిమా అయినా, ఈ రోజుల్లో పబ్లిసిటీ మొదట్నుంచి ఉండాలని, తద్వారా మూవీ ప్రేక్షకుల్లోకి మరింతగా దగ్గరకి వెళ్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి(Anil Ravipudi),చిరంజీవి(Chiranjeevi)సినిమా కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారని చెప్తున్నారు.

ఇక అధికారకంగా ప్రకటించకపోయినా 'డ్రాగన్'(Dragon)అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మెజారిటీ అభిమానులు డ్రాగన్ టైటిల్ ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కానుంది. కన్నడ స్టార్ హీరోయిన్ 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)ఎన్టీఆర్ తో జత కడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.