English | Telugu

"నిప్పు" ఆడియో జనవరి 20 న

"నిప్పు" ఆడియో జనవరి 20 న విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు వారి పతాకంపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, పొడుగు కాళ్ళ సుందరి దీక్షా సేథ్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో దర్శక, నిర్మాత వై.వి.యస్. చౌదరి నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "నిప్పు".

ఈ చిత్రానికి శతాధికచిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ "నిప్పు" చిత్రం ఆడియో జనవరి 20 వ తేదీన, సినీ అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత వై.వి.యస్. చౌదరి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ "నిప్పు" చిత్రం ఆడియోని తెలుగువన్ ప్రేక్షకులు తెలుగువన్ డాట్ కామ్ లో లైవ్ టెలికాస్ట్ చూడవచ్చు. అలాగే "టోరి" (తెలుగువన్ రేడియో ఆన్ ఇంటర్నెట్) శ్రోతలు కూడా ఈ "నిప్పు" చిత్రం ఆడియోని లైవ్ బ్రాడ్ కాస్ట్ వినవచ్చు. ఈ "నిప్పు" చిత్రం ఫిబ్రవరి 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.