Read more!

English | Telugu

నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే!

ఓటీటీ ప్రేక్షకులు నిత్యం కొత్త సిమిమాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికోసం ప్రతీవారం అరడజను సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మరి అలా రిలీజ్ అయిన వాటిల్లో కామెడీ, థ్రిల్లర్ జానర్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతుంటాయి.

అయితే ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి మరో కొత్త సినిమా వచ్చేసింది. అశోక్ సెల్వన్, వసంత్ రవి, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ 'పొన్ ఒండ్రు కండేన్'. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ సినిమాకి ప్రియ దర్శకత్వం వహించగా.. జీయో స్టూడియోస్ బ్యానర్ పై యువన్ శంకర్ రాజా,  జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. అయితే మొదట ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల నేరుగా ఓటీటీలోకి తోసుకొచ్చేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో ఈ 'పొన్ ఒండ్రు కండేన్' మూవీని నేటి నుండి స్ట్రీమింగ్ కి తోసుకొచ్చినట్లు అశోక్ సెల్వన్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. కలర్స్ టీవీ తమిళంలోనూ అందుబాటులోకి రానున్న  ఈ సినిమా ఓటీటీలో ఎన్ని భాషలలో విడుదలవ్వనుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో దీప శంకర్, సచ్చు కీలక పాత్రలు పోషించారు. మరి మీలో ఎంతమంది జియో సినిమాలో వచ్చే సినిమాలు, సిరీస్ లు చూస్తుంటారు. ఈరోజే రిలీజ్ అయిన ఈ 'పొన్ ఒండ్రు కండేన్' ని చూసేయ్యండి.