English | Telugu

మహేష్ శ్రీమంతుడులో నయనతార

మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు సడన్ గా ఈ సినిమాలో నయనతార ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? ఇది వేరే మేటర్లేండి. నయనతార కథానాయికగా నటించిన `మయూరి` ట్రైలర్ ను శ్రీమంతుడు థియేటర్లలో ప్రదర్శించబోతున్నారట. అది మ్యాటర్.

నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకుడిగా తమిళంలో `మాయ` అనే చిత్రం తెరకెక్కింది. అదే చిత్రం తెలుగులో `మయూరి`గా విడుదల కాబోతోంది. ఇందులో నయనతార దెయ్యంగా కనిపించబోతోందట. రెండు భాషల్లోనూ సినిమాని తీశారు. తెలుగు వర్షన్ కి సి.కళ్యాణ్ నిర్మాత. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు. ఆగస్టు రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ సినిమాని విడుదల చేస్తారు. మహేష్ తో పాటు ట్రైలర్ వస్తోంది కాబట్టి `మయూరి`కి మంచి పబ్లిసిటీనే దక్కబోతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.