English | Telugu

ఎన్టీఆర్ పెద్ద కోడలు మృతి

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం.. యుగపురుషుడు..మాజీ ముఖ్యమంత్రి.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ 'నందమూరి తారకరరామారావు'(Ntr).ఆయన కుటుంబసభ్యులని అభిమానులతో పాటు తెలుగు వాళ్లంతా తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు.

ఈ రోజు తెల్లవారు జామున 'ఎన్టీఆర్' పెద్ద కోడలు, నందమూరి జయకృష్ణ భార్య 'పద్మజ'(Padmaja)మృతి చెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెని హాస్పిటల్ లో చేర్పించారు. చివరకి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పద్మజ గారి మరణ వార్తతో విజయవాడ నుండి ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీ నుండి శ్రీమతి పురందేశ్వరి పద్మజ గారి పార్థివ దేహాన్ని సందర్శించడానికి వస్తున్నారు.మిగతా ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది.

నందమూరి జయకృష్ణ,పద్మజ గార్ల కొడుకు పేరు 'చైతన్య కృష్ణ'. హీరోగా పలు చిత్రాలు చేసాడు. గత ఏడాది 'బ్రీత్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా జయకృష్ణ నే ఆ చిత్రాన్ని నిర్మించాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.