Read more!

English | Telugu

శిరిడి సాయిగా నాగార్జున

శిరిడి సాయి"గా నాగార్జున నటించబోతున్నారు. వివరాల్లోకి వెళితే సాయికృపా ఎంటర్ టైన్‍ మెంట్ పతాకంపై, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేశ్వరరెడ్డి నిర్మిస్తున్న చిత్రం "శిరిడిసాయి". ఈ చిత్రానికి శ్రీమతి సులోచన సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి యమ్ యమ్ కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. నాగార్జున "శిరిడి సాయి" చిత్రానికి యస్ గోపాల రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నాగార్జున "శిరిడి సాయి" చిత్రానికి సంభాషణలను పరుచూరి బ్రదర్స్ వ్రాస్తున్నారు. నాగార్జున "శిరిడి సాయి" చిత్రానికి భక్త సురేష్ కుమార్ కథా సంకలనాన్ని అందిస్తూండగా, పొందూరి హనుమంతరావు కథా సహకారాన్ని అందిస్తున్నారు.

 

 

గతంలో కె.రాఘవేంద్రరావు "శ్రీమంజునాథ" చిత్రాన్ని తీయగా ఆ తర్వాత నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో "అన్నమయ్య", "శ్రీరామదాసు" వంటి భక్తిరస చిత్రాలు వచ్చి ఘనవిజయం సాధించాయి. ఆ తర్వాత "పాండురంగ మహత్మ్యం" చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినా ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ మళ్ళీ నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వస్తున్న ఈ "శిరిడి సాయి" చిత్రం ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని ఈ చిత్రం యూనిట్ కనబరిచింది.