English | Telugu

నాగ్ హీరోగా మలినేని గోపీచంద్ చిత్రం

నాగ్ హీరోగా మలినేని గోపీచంద్ చిత్రం ఉంటుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే యువ హీరోలతో పోటీపడుతూ సినిమా మీద సినిమా చేస్తున్న యువసామ్రాట్, కింగ్ నాగార్జున హీరోగా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై యమ్.యల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మలినేని గోపీచంద్ రవితేజ హీరోగా "డాన్ శీను", విక్టరీ వెంకటేష్ హీరోగా "బాడీ గార్డ్" చిత్రాలకు దర్శకత్వం వహించి విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం నాగార్జున "డమరుకం" చిత్రాన్ని పూర్తి చేసి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో "శిరిడి సాయి" చిత్రంలో సాయిబాబాగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దశరథ్ దర్శకత్వంలోని చిత్రంలో నాగ్ హీరోగా నటిస్తారు. దాని తర్వాత మలినేని గోపీచంద్ చిత్రం ఉంటుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.