English | Telugu

"అధినాయకుడు" మార్చ్ 23 న...?

"అధినాయకుడు" మార్చ్ 23 న...? విడుదల కానుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తూండగా, జయసుధ, సలోని, లక్ష్మీరాయ్, ఛార్మిప్రథాన పాత్రల్లో నటిస్తూండగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "అధినాయకుడు". ఈ "అధినాయకుడు" చిత్రం నిజానికి సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల కావలసింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఫిబ్రవరి 18 శివరాత్రికి రిలీజన్నారు...కానీ ప్రస్తుతం మార్చ్ 23 వ తేదీన ఈ "అధినాయకుడు" చిత్రం విడుదలవుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.