Read more!

English | Telugu

చైతూ ఆ హీరోయిస్లనే ఇష్టపడ్డాడా..?

నాగచైతన్య రీమేక్ చేస్తున్న మళయాళ రీమేక్ ప్రేమమ్ లో టైటిల్ నే కాక, హీరోయిన్లను కూడా కంటిన్యూ చేస్తున్నారు. టీచర్ పాత్ర చేసిన సాయి పల్లవి ప్లేస్ లో మాత్రం శృతి హాసన్ ను తీసుకున్నారు. మిగిలిన రెండు పాత్రలకు, ఒరిజినల్ లో యాక్ట్ చేసిన అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్లనే కంటిన్యూ చేస్తున్నారు. శృతి చేయబోయే పాత్ర సినిమాలో బెస్ట్ గా ఉండబోతోందంటోంది ప్రేమమ్ టీం. ఒక వ్యక్తికి తన స్కూల్ లైఫ్ నుంచి, సెటిల్ అయ్యే వరకూ అనుభవమైన మూడు ప్రేమకథలే ప్రేమమ్ అని తెలుస్తోంది. కార్తికేయ ఫేం చందు మొండేటి తెరెకెక్కిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి చైతూ, మళయాళ ప్రేమమ్ రేంజ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.