English | Telugu

'ఆగడు'లో నాగార్జున కామెడి..!

దూకుడు సినిమాలో నాగార్జున గారి పేరును వాడుకొని బ్రహ్మానందంతో మహేష్ ఆడుకున్న సన్నివేశాలు ఎవరైన మరిచిపోతారా? నాగార్జున గారి రియాల్టీ షో అని బ్రాహ్మీని వాడుకున్న తీరును అటు మహేష్ అభిమానులు, నాగార్జున అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆగడు కోసం మరోసారి నాగార్జున గారి పేరును శ్రీనువైట్ల వాడినట్లు సమాచారం. బుల్లితెరపై సూపర్ హిట్ షోగా పేరుతెచ్చుకున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పై ఆగడులో బ్రహ్మానందాన్ని పెట్టి ఓ స్పూఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పూఫ్ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఈ స్పూఫ్ మనం కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే 19వరకు ఆగాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.