English | Telugu

జనవరి 20 నుండి నాగ్ "షిరిడీ సాయి"

జనవరి 20 నుండి నాగ్ "షిరిడీ సాయి" చిత్రం ప్రారంభం కానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున షిరిడీ సాయి బాబాగా నటిస్తుండగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించబడుతున్న"షిరిడీ సాయి" చిత్రం 2012 జనవరి 20 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాగార్జున ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం"డమరుకం" చిత్రంలో నటిస్తున్నారు.

"డమరుకం" చిత్రంలో నాగ్ పాత్ర డిసెంబర్ 20 తో పూర్తి కానుంది. అక్కణ్ణించి ఒక నెల పాటు నాగ్ గడ్డం పెంచి మరీ ఈ సాయిబాబా పాత్రలో నటిస్తారట. అన్నమయ్య, శ్రీ రామదాసు చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో, నాగ్ నటిస్తున్న మూడవ భక్తిరస చిత్రమిదే అవుతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.