English | Telugu

ఆగస్ట్‌ నెల మూవీ లవర్స్‌కి పండగే.. ఆ రెండు సినిమాల మధ్యే అసలైన వార్‌!

2025 జనవరి నుంచి జూలై వరకు పలు భాషల్లో ఎన్నో సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అయితే ఆగస్ట్‌ నెలలో రిలీజ్‌ అయ్యే సినిమాలు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఈ ఏడు నెలల్లో ఎక్కువ సినిమాలు రిలీజ్‌ అవుతున్నది ఈ నెలలోనే. జూలై 31న విడుదలైన విజయ్‌ దేవరకొండ సినిమా ‘కింగ్డమ్‌’ డివైడ్‌ టాక్‌తోనే మొదలై కలెక్షన్ల పరంగా ఫర్వాలేదు అనిపించుకుంటోంది. ఇక ఆగస్ట్‌ 1న విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ ప్రధాన పాత్రల్లో పాండిరాజ్‌ రూపొందించిన ‘సార్‌ మేడమ్‌’ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ అయింది. వారం క్రితమే ఈ సినిమా తమిళ్‌ వెర్షన్‌ విడుదలై మంచి టాక్‌ సంపాదించుకుంది. వీటితో పాటు శుక్రవారం ఉసురే, థాంక్‌ యు డియర్‌, బాలీవుడ్‌ మూవీస్‌ సన్నాఫ్‌ సర్దార్‌ 2 , ధఢక్‌ 2 లాంటి మూవీస్‌ వచ్చేస్తున్నాయి. వీటిలో ఏ సినిమా ఆడియన్స్‌ను మెప్పిస్తుందో చూడాలి.

ఇక రెండో వారంలో ఆగస్ట్‌ 8న వైవా హర్ష, ప్రవీణ్‌ ప్రధాన పాత్రల్లో ‘బకాసుర రెస్టారెంట్‌’ రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. హిందీ చిత్రాలు ‘హీర్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘అందాజ్‌2’ కూడా ఇదే రోజు రిలీజ్‌ అవుతున్నాయి. ఈ కొత్త సినిమాల వరసలోనే సూపర్‌స్టార్‌ మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో 20 సంవత్సరాల క్రితం విడుదలైన ‘అతడు’ చిత్రాన్ని ఆగస్ట్‌ 9న మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా 4కె వెర్షన్‌లో రీరిలీజ్‌ చేయనున్నారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రెండు సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. రజినీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’ ఆగస్ట్‌ 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నాగార్జున నెగెటివ్‌ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌ పోషించారు. అలాగే కన్నడ హీరో ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ఒక ప్రత్యేక పాత్రలో అలరించబోతున్నారు. ఈ సినిమాపై తమిళ్‌, తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక భారతదేశంలోని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సినిమా ‘వార్‌2’. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఆగస్ట్‌ 14నే రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘వార్‌’ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ‘వార్‌2’పై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. అందులోనూ ఎన్టీఆర్‌ నటించిన తొలి హిందీ సినిమా కావడం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ భారీ వ్యూస్‌ సాధించడమే కాకుండా థియేటర్లలో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్ని సిద్ధం చేసింది. కూలీ, వార్‌2 చిత్రాలు బాక్సాఫీస్‌పై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఆగస్ట్‌ మూడో వారంలో అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పరదా’ చిత్రం 22న విడుదల కాబోతోంది. ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ కూడా ఇదేరోజు రిలీజ్‌ అవుతోంది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే అవకాశం ఉంది. ఈ కొత్త సినిమాల మధ్యలోనే మెగాస్టార్‌ చిరంజీవి ‘స్టాలిన్‌’ చిత్రాన్ని రీరిలీజ్‌ చెయ్యబోతున్నారు. దాదాపు 20 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ ఓపెనింగ్స్‌ సాధించి చిరంజీవి కెరీర్‌లో ఓ మంచి సినిమాగా నిలిచింది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న ‘స్టాలిన్‌’ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో రీరిలీజ్‌ చేస్తున్నారు.

మాస్‌ మహారాజ్‌ రవితేజ నటించిన 75వ చిత్రం ‘మాస్‌ జాతర’ రాబోతోంది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని వినాయకచవితి కానుకగా ఆగస్ట్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్‌ కృషి చేస్తోంది. అయితే రిలీజ్‌ డేట్‌ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు. నారా రోహిత్‌ హీరోగా వెంకటేష్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుందరకాండ’ చిత్రాన్ని ఆగస్ట్‌ 27న విడుదల చేయబోతున్నారు. ఇక నెలాఖరులో సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీ కపూర్‌ జంటగా రూపొందిన ‘పరమ్‌ సుందరి’ చిత్రాన్ని ఆగస్ట్‌ 29న విడుదల చేస్తున్నారు. నార్త్‌ ఇండియన్‌ అబ్బాయి, సౌత్‌ ఇండియన్‌ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథగా తుషార్‌ జలోటా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అదేరోజున కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో కె.చంద్రు దర్శకత్వంలో రూపొందిన ‘రివాల్వర్‌ రీటా’ విడుదల కాబోతోంది. కామెడీ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడున్న ట్రెండ్‌కి భిన్నంగా పాత సినిమా టైటిల్‌తో వస్తుండడం విశేషం. ఇలా ఆగస్ట్‌ నెల మొత్తం ఎన్నో సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది, ఏ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది అనేది చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.