Read more!

English | Telugu

వాళ్లకు మోహన్ బాబు సీరియస్ వార్నింగ్స్

నిన్న రాత్రి మంచు విష్ణు, రాజ్ తరుణ్ నటించిన ఈడో రకం ఆడో రకం ఆడియో విడుదల వేడుక జరిగింది. ఫంక్షన్లో డబుల్ మీనింగ్ డైలాగులు కాస్త ఎక్కువగానే పేలాయి. అసలే మంచు వారి ఫంక్షన్. పైగా మోహన్ బాబు కూడా అక్కడే ఉన్నారు. దాంతో సదరు డబుల్ మీనింగ్స్ కు మోహన్ బాబు గారికి కోపం నషాళానికెక్కింది. డైరెక్టర్ కు, రైటర్ కు, ఇద్దరు హీరోలకు ఇలా స్టేజీ పై మాట్లాడిన వాళ్లందరికీ స్మూత్ గా తలంటేశారు. డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డికి మందు గురించి పబ్లిక్ ఫంక్షన్లో మాట్లాడకూడదని వార్నింగ్ ఇస్తే, హీరోయిన్ హగ్ ఇవ్వలేదన్న రైటర్ డైమండ్ రత్నాన్ని అసలు నీకెందుకు హగ్ ఇవ్వాలి అని క్లాస్ ఇచ్చారు. ఇక రాజ్ తరుణ్, విష్ణు లకు కూడా ఎవరో ఒక్కర్ని మాత్రమే పొగడటం కరెక్ట్ కాదని సున్నితంగా మందలించారు. రాజ్ తరుణ్ హెబ్బాపటేల్ ను మాత్రమే పొగడటం వలన ఆ తిప్పలు వచ్చాయి. మామూలుగానే మోహన్ బాబు ఉంటే పరిసర ప్రాంతాల్లో క్రమశిక్షణ ఉండాలి. అలాంటిది డబుల్ మీనింగ్స్ ఆయన ముందే పడితే, ఎలా ఊరుకుంటారు. అందుకే బట్టల సబ్బేసి మరీ ఉతికేశారు కలెక్షన్ కింగ్.