English | Telugu

'కన్నప్ప'లో మోహన్ బాబు.. మరో సీనియర్ స్టార్ కూడా!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి సూపర్ స్టార్స్ కన్నప్ప ప్రాజెక్ట్‌ లోకి రావడంతో ఈ మూవీ స్థాయి పెరిగింది. ఇప్పుడు ఈ భారీ తారాగణంలోకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విలక్షణ నటుడు శరత్ కుమార్ కూడా వచ్చారు. ఈ ఇద్దరు సీనియర్ నటులు తమ విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పుడు ఈ ఇద్దరు 'కన్నప్ప'లో ఎలాంటి పాత్రలు పోషించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.తాజాగా ఈ ఇద్దరు కన్నప్ప సెట్స్ లో అడుగుపెట్టారు.

శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీకాళహస్తిలోని గుడిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహాభారతం సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. విష్ణు సరైన విజయాన్ని అందుకొని చాలా కాలం అవుతోంది. మరి ఎందరో స్టార్స్ భాగమైన ఈ భారీ సినిమాతోనైనా విష్ణు ఘన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.