English | Telugu

ఈయన అందరిలాంటివాడు కాదట !

పవన్ కళ్యాణ్, నాగార్జున ఇటీవలే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి తమ మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే మంచు వారి ఫ్యామిలీ కూడా రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మోహన్ బాబు, మంచు లక్ష్మీ స్పందించారు. మేము రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లుగా కొన్ని ఊహాగానాలు వినిపించాయి. నేను అందరిలాంటి వాడిని కాను అని మోహన్ బాబు అన్నారు. మంచు లక్ష్మి కూడా.. నరేంద్ర మోడీ అంటే తనకు ఇష్టమని కానీ, ఈ ఎన్నికలలో నేనేమి పోటీ చెయ్యట్లేదు. కానీ నా మద్దతు ఆయనకే అని తెలిపింది. సినిమారంగం నుండి మొదటిసారిగా ఆయనని కలిసింది మా కుటుంబమేనని చెప్పుకొచ్చింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.