English | Telugu

మోహన్ బాబు,విష్ణుల గన్స్ స్వాధీనం..బౌన్సర్ల బైండోవర్  

మోహన్ బాబు(mohan babu)మనోజ్(manoj)మధ్య గత రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.విష్ణు రాకతో ఈ గొడవ మరింతగా ముదిరిందని చెప్పవచ్చు.ఇందుకు నిదర్శనంగా నిన్న మనోజ్ ఇంటి గేట్ పగలకొట్టి లోపలకి వెళ్లడం.ఆ తర్వాత చినిగిన చొక్కాతో బయటకి రావడం కూడా జరిగింది.ఇక ఈ విషయాన్నీ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధిని మోహన్ బాబు కొట్టడంతో ప్రస్తుతం సదరు మీడియా ప్రతినిధి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.దీంతో మోహన్ బాబు ని అరెస్ట్ చెయ్యాలనే డిమాండ్ ని మీడియా ప్రతినిధులు తెర మీదకి తీసుకొస్తున్నారు.పోలీసులు కూడా ఈ సంఘటనలో సీరియస్ గా ఉన్నారు.

దీంతో మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్ల ను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.అదే విధంగా మోహన్ బాబు,విష్ణు దగ్గర ఉన్న గన్స్ ని కూడా కోర్టు లో డిపాజిట్ చేయాలని అదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం మోహన్ బాబు కోర్టు లో హాజరు కావడంతో పాటు లక్షరూపాయలు ని బాండ్ రూపంలో ఇవ్వాలని కూడా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ అండ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.