English | Telugu

కోపం తగ్గాలంటే ఆ పని చెయ్యి.. దటీజ్ మోహన్ బాబు 

సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటు ఎన్నో విశిష్టమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు పద్మశ్రీ 'మంచు మోహన్ బాబు'(MOhan Babu).సినీ రంగంలో ఆయన చూడని రికార్డు లేదు. ఎన్నో చిత్రాలు శతదినోత్సవాలు,సిల్వర్ జూబ్లీలు జరుపుకున్నాయి. గత నెలలో తనయుడు 'విష్ణు' టైటిల్ రోల్ పోషించిన 'కన్నప్ప'(Kannappa)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, 'మహాదేవ శాస్త్రి' అనే క్యారక్టర్ లో మరోసారి అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించాడు.

రీసెంట్ గా మోహన్ బాబు ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో సూపర్ స్టార్ తలైవా 'రజనీకాంత్'(Rajinikanth)గురించి ప్రస్తావనకి వచ్చింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతు రజనీకి నాకు మధ్య యాభై సంవత్సరాల అనుబంధంతో పాటు, ముద్దుగా 'హే బ్లడీ తలైవా' అని పిలిచేంత చనువు కూడా ఉంది. నటులుగా పరిచయం కాకముందు, మద్రాస్ రైల్వే
స్టేషన్ ప్లాట్ ఫామ్ పై కలిసాం. అప్పుడు మా ఇద్దరి దగ్గర ఏమి లేవు. రోజులో కనీసం మూడు నాలుగు సార్లు అయినా మెసేజ్ లు చేసుకుంటాం. ఇటీవల రజనీని కలిసాను. నాతో మాట్లాడుతు ' నాకు గతంలో ఎంత కోపం ఉండేదో నీకు తెలుసు. ఆ తర్వాత దాన్ని వదిలేసాను. కానీ నువ్వెందుకు వదలలేకపోతున్నావు. పుస్తకాలు చదవడం కాదు. అందులోని సారాంశాన్ని అర్ధం చేసుకొని కోపాన్ని వదిలేయ్ అని సలహా ఇచ్చాడని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

మోహన్ బాబు,రజనీకాంత్ మధ్య ఉన్నస్నేహబంధం గురించి అందరికి తెలిసిందే. రజనీకాంత్ కూడా చాలా సందర్బాల్లో మోహన్ బాబు తన ప్రాణస్నేహితుడిని చెప్పాడు. ఇద్దరు కలిసి చేసిన 'పెదరాయుడు' మూవీ తెలుగులో అనేక రికార్డులని నెలకొల్పింది. మరో సారి రజనీ, మోహన్ బాబు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రజనీ తన అప్ కమింగ్ మూవీ 'కూలీ'(Coolie)తో ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.