English | Telugu

మాస్ జాతర బిజినెస్.. ఈసారైనా హిట్ కొడతాడా..?

- వరుస ఫ్లాప్స్ లో రవితేజ
- మాస్ జాతర పైనే ఆశలన్నీ
- బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?
- రవితేజ హిట్ కల నెరవేరుతుందా?

ఒక మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ (RaviTeja).. ఇప్పుడు 'మాస్ జాతర'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయంలో సేఫ్ గేమ్ ఆడినట్లు అర్థమవుతోంది. (Mass Jathara)

2018 నుంచి ఈ ఏడేళ్లలో రవితేజ హీరోగా నటించిన 12 సినిమాలు విడుదల కాగా.. అందులో 'క్రాక్', 'ధమాకా' మాత్రమే విజయం సాధించాయి. వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో రవితేజ ఆలోచనలో పడ్డాడు. అందుకే తనకి బాగా అచ్చొచ్చిన, గతంలో ఎన్నో విజయాలను అందించిన 'యాక్షన్ కామెడీ' జానర్ ను నమ్ముకొని 'మాస్ జాతర' చేశాడు. ఈ మూవీ అక్టోబర్ 31 సాయంత్రం నుండి థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: బోయపాటి శ్రీను హిట్స్ & ఫ్లాప్స్.. ఆ ఒక్క సినిమా..?

ప్రస్తుత రవితేజ ట్రాక్ రికార్డుని దృష్టిలో పెట్టుకొని.. 'మాస్ జాతర' బిజినెస్ విషయంలో మేకర్స్ రిస్క్ చేయలేదని తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల లోపే జరిగినట్లు సమాచారం. నైజాంలో రూ.5.5 కోట్లు, సీడెడ్ లో రూ.2.5 కోట్లు, ఆంధ్రాలో రూ.7.5 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.15.5 కోట్ల బిజినెస్ చేసిందట. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.1.5 కోట్లు, ఓవర్సీస్ రూ.2 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. అంటే హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.20 కోట్ల షేర్ రాబట్టాల్సింది ఉంది.

గత కొన్నేళ్ళుగా రవితేజ మెజారిటీ సినిమాలు 20 కోట్లకు అటూఇటూగా థియేట్రికల్ బిజినెస్ చేశాయి. 30 కోట్లకు పైగా బిజినెస్ చేసిన టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ సినిమాలు మాత్రం భారీ నష్టాలను మిగిల్చాయి. రవితేజ స్టార్డమ్ కి 20 కోట్ల బిజినెస్ అనేది సేఫ్ గేమ్ అని చెప్పవచ్చు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. మంచి లాభాలు పొందే అవకాశముంది. మరి 'మాస్ జాతర' అదే బాటలో పయనించి.. రవితేజ ఎదురుచూస్తున్న విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.