English | Telugu

మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్.. ఇదైనా నమ్మొచ్చా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను బోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం మాస్ రాజా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 'మాస్ జాతర' పలుసార్లు వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. (Mass Jathara)

'మాస్ జాతర' సినిమాని ఈ అక్టోబర్ 31న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రవితేజ, హైపర్ ఆదిలపై చిత్రీకరించిన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో సినిమా పలుసార్లు వాయిదా పడటంపై సెటైర్లు వేస్తూ, కొత్త విడుదల తేదీని రివీల్ చేయడం సరదాగా ఉంది. వినాయక విగ్రహం మీద ఒట్టేసి మరీ.. అక్టోబర్ 31న సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని రవితేజ హామీ ఇచ్చాడు.

'మాస్ జాతర'లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇది 'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ-శ్రీలీల కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడం విశేషం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

రవితేజ అభిమానులు, మాస్ ప్రేక్షకులు మెచ్చేలా అన్ని కమర్షియల్ హంగులతో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా 'మాస్ జాతర' చిత్రాన్ని మలుస్తున్నారు. 2022 లో వచ్చిన ధమాకా తర్వాత రవితేజ ఖాతాలో కమర్షియల్ సక్సెస్ లేదు. ఆ లోటుని 'మాస్ జాతర' తీరుస్తుందేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.